సీఎం జగన్ 5 ఎకరాల స్థలం ఇస్తానన్నారు: పీవీ సింధు
posted on Sep 13, 2019 12:32PM
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో స్వర్ణం సాధించిన భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు. తన తల్లిదండ్రులతో కలసి అమరావతిలోని సచివాలయానికి వచ్చిన పీవీ సింధు.. సీఎంని కలిశారు. ఈ సందర్భంగా జగన్.. సింధుకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించడంతో పాటు, శాలువా కప్పి సత్కరించారు. ఆమెకు అభినందలను తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని జగన్ ఆకాంక్షించారు.
అనంతరం పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ.. వైజాగ్ లో బ్యాడ్మింటన్ అకాడమీ నొలకొల్పేందుకు ఐదు ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు సీఎం అంగీకరించారని తెలిపారు. అన్ని రకాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. పద్మభూషణ్ పురస్కారానికి తన పేరును పరిశీలిస్తుండటం గర్వంగా ఉందని సింధు తెలిపారు.