టీటీడీ ఛైర్మన్‌ పదవికి పుట్టా రాజీనామా!!

 

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్‌ పదవికి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ రాజీనామా చేశారు. పుట్టా తన రాజీనామా లేఖను టీటీడీ ఈవో అనిల్‌ సింఘాల్‌కు అందజేశారు.

టీడీపీ హయాంలో టీటీడీ ఛైర్మన్‌ పదవి చేపట్టిన పుట్టా.. వైసీపీ అధికారంలోకి వచ్చినా తన పదవికి రాజీనామా చేయలేదు. తొలగించే వరకు కొనసాగుతానని మొదట చెప్పారు. అయితే ఆర్డినెన్స్‌ ద్వారా గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటైన టీటీడీ పాలక వర్గాన్ని తొలగిస్తామని బుధవారం ఉదయం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పుట్టా తన పదవికి రాజీనామా చేసారు.

మరోవైపు టీటీడీ కొత్త ఛైర్మన్‌గా వైసీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ప్రభుత్వం నియమించినట్లు తెలుస్తోంది. సుబ్బారెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.