గల్ఫ్‌లో కరోనా దెబ్బ‌కు ఖైదీల విడుదల!

సాధార‌ణంగా పండుగ సంద‌ర్భాల్లోనో, లేక ప్ర‌త్యేక సంతోష‌క‌ర‌మైన సంద‌ర్భాల్లో ఖైదీల‌ను విడిచిపెట్ట‌డం గ‌ల్ఫ్ దేశాల్లో ఆన‌వాయితీగా వ‌స్తోంది. అయితే ప్ర‌స్తుత‌మున్న ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి నిర్మూలనలో భాగంగా జైళ్లలో శిక్ష అనుభ‌విస్తున్న‌ ఖైదీలను గల్ఫ్‌ దేశాలు విడుదల చేస్తున్నాయి. 

ఒమన్‌లోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 599 మంది ఖైదీలను విడుదల చేస్తూ ఒమన్‌ సుల్తాన్‌ షేక్‌ హైతం బిన్‌ తారిఖ్‌  హుకుం జారీ చేశారు. ఇందులో 366 మంది విదేశీ ఖైదీలుండగా.. వారిలో భారతీయులే ఎక్కువ సంఖ్య‌లో ఉన్నార‌ట‌. అయితే తెలుగు వారు ఎంత మంది వున్నార‌నేది తెలియాల్సి వుంది.

సౌదీ అరేబియా కూడా 250 మంది విదేశీ ఖైదీలను విడుదల చేసింది. మిగిలిన గల్ఫ్‌ దేశాలు కూడా కరోనా కారణాన ఖైదీలను విడుదల చేస్తున్నాయి. ఇరాన్ 85 వేల మంది ఖైదీల‌ను విడుద‌ల చేసింది.

వీసా నేరాలపై పట్టుబడిన కొంత మంది భార‌తీయుల్ని దుబాయి, షార్జా పోలీసులు ఉదారంగా వదిలేశారు.