యోగాతో ప్రపంచం భారత్‌ వైపు చూస్తోంది-మోడీ

యోగా వల్ల ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లక్నోలోని రమాబాయ్ అంబేద్కర్ గ్రౌండ్‌లో నిర్వహించిన యోగా డే వేడుకల్లో మోడీ పాల్గొన్నారు. వేల సంఖ్యలో వచ్చిన ప్రజలతో కలిసి ప్రధాని యోగాసనాలు వేశారు. అనంతరం మోడీ మాట్లాడుతూ..పైసా ఖర్చు లేకుండా యోగాతో పరిపూర్ణమైన ఆరోగ్యం సాధించవచ్చన్నారు. యోగా వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయని..ఎంతో మంది దీని వల్ల ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అధికారులు పాల్గొన్నారు.