కథువా ఘటనపై పై రాష్ట్రపతి ఆగ్రహం..సమాజం ఎటుపోతోంది....


కథువా ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా స్పందించి ఆవేదన వ్యక్తం చేశారు. కత్రాలో జరిగిన శ్రీమాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.... మనకు స్వాతంత్ర్యం వచ్చిన డెబ్భై ఏళ్ల తర్వాత కూడా చిన్నారులపై ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని, మన సమాజం ఎటుపోతోందో ఆలోచించుకోవాలని, ఇకపై ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకుండా చూడాలని అన్నారు. ఆడపిల్లలకు ఒంటరిగా తిరిగే స్వేచ్ఛనిచ్చి, ఇప్పుడు వాళ్లపై పైశాచికత్వం చూపడం అత్యంత దారుణమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు.