ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన.. ఏ పార్టీకి పనిచేయను.!!
posted on Sep 10, 2018 2:09PM
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన చేసారు.. 2019 లోక్సభ ఎన్నికల్లో తాను ఏపార్టీ తరపున ప్రచారం చేయనని క్లారిటీ ఇచ్చారు.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బీ లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2019లో ఏ పార్టీకి పనిచేస్తారని ప్రశ్న వేస్తే కచ్చితంగా ఏ పార్టీకి పనిచేయననే చెబుతానని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేసారు.. పార్టీలకు ఎటువంటి రూపంలో పనిచేయనని చెప్పిన ప్రశాంత్ కిషోర్ గత 4-5 ఏళ్లలో పార్టీలకు ఆ నేతలకు పనిచేసి ఇక చాలనిపిస్తోందని అన్నారు.. తాను వ్యక్తిగతంగా ఏ పార్టీకి పనిచేయను కానీ తాను స్థాపించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపాక్) సంస్థ మాత్రం మనుగడలో ఉంటుందని తెలిపారు.. 2015లో మొదటగా స్థాపించిన దానికంటే ప్రస్తుతం అది 20 రెట్లు ఎక్కువగా పెరిగిందని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు.. ఇక రాజకీయాలను పక్కనబెట్టి గుజరాత్ కానీ బీహార్ కాని వెళ్లి ప్రజలకోసం ప్రజలతో పనిచేయాలని ఉందని అన్నారు.