పీకే సంచలన ట్వీట్.. భారత్ లో కరోనా కేసుల అసలు లెక్కలివి

భారత్ లో నాలుగు దశల లాక్ డౌన్ తరువాత తాజాగా అన్ లాక్ 1 ఈ రోజు నుండి మొదలయింది. ఐతే దేశ  వ్యాప్తంగా 190 కరోనా పాజిటివ్ కేసులతో లాక్ డౌన్ మొదలయింది. ప్రస్తుతం 1,90,000 కరోనా పాజిటివ్ కేసులతో  అన్ లాక్ 1 మొదలౌతోంది. దీని పై తాజాగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన ట్వీట్ చేశారు. లాక్‌డౌన్ అమలు మొదలైనప్ప్పటి నుండి అన్‌లాక్ మొదటి దశ వరకు.. అంటే మార్చి 20 నుండి  మే 31 మధ్య కరోనా మహమ్మారి పరిస్థితిని గణాంకాలతో సహా ఆయన ట్వీట్ చేశారు. ‘‘లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది మొదలు ఉపసంహరణ మొదటి దశ వరకు భారత్‌లో కోవిడ్-19 కేసుల లెక్క ఇదీ.. దీన్ని కూడా గుర్తుంచుకోండి మరి..’’ అని  ఈ సందర్భంగా ఆయన నర్మగర్బంగా వ్యాఖ్యానించారు.