ఈ నెల 30న ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. సోమవారం సమావేశమైన ఉన్నత విద్యామండలి ఈ నెల 30 న ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తేదీని వెల్లడించాలని నిర్ణయించింది. ఆగష్టు 7 నుంచి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన ముగిసే లోపు తమ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ ప్రభుత్వాల ముందుంచుతారు. కౌన్సిలింగ్ అవసరమైన చర్యలు పూర్తి చేయాలని కూడా ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అధికారులు లేకున్నా కోరం ఉన్నందున కౌన్సిలింగ్ తేదీలపై నిర్ణయాన్ని వెలువరించారు. ఈ సమావేశానికి తెలంగాణ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ హాజరుకాలేదు.