వైద్య చరిత్రలో అద్భుతం జరిగింది

 

ప్రపంచ వైద్య చరిత్రలో అద్భుతం జరిగింది. సాధారణంగా గర్భిణిగా వున్న స్త్రీ మరణిస్తే ఆమె గర్భంలో వున్న శిశువు కూడా చనిపోతుంది. అయితే గాజా అల్లర్ల నేపథ్యంలో పాలస్తీనాలో ఒక నిండు గర్భిణి పేలుళ్ళ కారణంగా మరణించింది. అయితే ఆమె గర్భంలో వున్న శిశువును అయినా బతికించాలన్న ఉద్దేశంతో డాక్టర్లు చాలా అర్జెంటుగా ఆ తల్లి మృతదేహానికే సర్జరీ చేశారు. ఆశ్చర్యకరంగా ఆమె కడుపులో వున్న ఆడశిశువు అప్పటికి బతికే వుంది. డాక్టర్లు ఆ పాపని ‘మిరాకిల్ బేబీ’ అని పిలుస్తున్నారు. తల్లి మరణించాక కడుపులో వున్న బిడ్డ బతికి వుండటం అనేది చాలా అరుదుగా జరుగుతూ వుంటుందని, ఒకవేళ గర్భిణి చనిపోయినప్పటికీ కొన్ని నిమిషాల వ్యవధిలో సర్జరీ చేసి బిడ్డను బయటకి తీసినట్టయితే బతికే అవకాశాలు వుంటాయని డాక్టర్లు చెబుతున్నారు. గాజా అల్లర్లలో ఆ తల్లి చనిపోయినప్పటికీ ఆ తల్లి కలలు మాత్రం ఇప్పుడు సజీవంగా వున్నాయి.