మరో స్కూలు బస్సు ప్రమాదం: నో ప్రాబ్లం

 

మెదక్ జిల్లా మాసాయిపల్లిలో జరిగిన స్కూలు బస్సు, రైలు ప్రమాదం విషాద జ్ఞాపకాలు ఇంకా అందర్నీ వెంటాడుతూనే వున్నాయి. అయినా కొంతమంది స్కూలు బస్సు డ్రైవర్లకు బుద్ధి వచ్చినట్టు కనిపించడం లేదు. రంగారెడ్డి జిల్లా కీసర మండంలోని బండ్ల గూడ దగ్గర ఓ పాఠశాల బస్సు వేగంగా వచ్చి ఒక ట్రాక్టర్ని, రెండు కార్లను ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు తీవ్ర కుదుపులకు గురైంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. అలాగే కార్లలో వున్నవారికి, ట్రాక్టర్ నడిపే వ్యక్తికి ఎలాంటి గాయాలు తగలలేదు. స్కూలు బస్సును నడుపుతున్న డ్రైవర్ తప్పతాగి బస్సును నడిపినట్టు తెలుస్తోంది.