డిప్యూటీ కే హోం!
posted on Jun 7, 2013 10:29AM
ఒక్కొక్కటిగా కాంగ్రెస్ పంచాయితీలు కొలిక్కి వస్తున్నట్టుగా కనిపిస్తుంది.. సబిత రాజీనామతో కాలీ అయిన హోం శాఖ కోసం నిన్నటి వరకు భారీ పోటి నేలకొంది.. అయితే ఇదే సమయంలో డియల్ బర్తరఫ్తో ఆంద్రా నాయకులంతా డిల్లీ చేరి అన్ని అంశాలపై భారీ లాభీయింగ్నే నడిపారు.. దీంతో ఇప్పుడు హోం శాఖ కేటాయింపుపై స్పష్టత వచ్చినట్టుగానే కనిపిస్తుంది..
సభిత రాజీనామా తరువాత చాలా మంది రాష్ట్ర నాయకులు హోంశాఖ పై ఆశపడ్డారు. వీరిలో జానా రెడ్డి, శ్రీదర్బాబు,దామోదర రాజనరసింహ, డికె అరుణ, సునీతా లక్ష్మారెడ్డి లాంటి వారు ఉన్నారు.. అయితే జానా.. తనకు ఇంతకు ముందు హోం శాఖ నిర్వర్తించిన అనుభవం కూడా ఉండటంతో మరోసారి తనకే అవకాశం దక్కుతుందని భావించారు..
వీరితో పాటు తెలంగాణ సెంటిమెంట్తో డిప్యూటి సియం దామోదర రాజనరసింహ, వివాద రహితుడినని శ్రీదర్బాబు, మహిళ కోటాలో డికె అరుణ, సునీతా లక్ష్మారెడ్డిలు హోం శాఖ కోసం గట్టిగానే ప్రయత్నించారు.. కాని గత వారం రోజులుగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయసమీకరణాలతో హోం శాఖ డిప్యూటినే వరించినట్టుగా తెలుస్తుంది..
తన సొంతం నిర్ణాయాలతో సియం పార్టీకి నష్టం చేస్తున్నాడన్న వాదన బలంగా వినిపిస్తున్న రాజనరసింహకు ఈ హోం ఇవ్వడంతో సియంకు కూడా అధిష్టానం ఓ హెచ్చరిక చేయాలనుకుంటుంది అంటున్నారు విశ్లేషకులు.. ఇప్పటి వరకు ఇవన్ని ఊహాగానాలే అయినా దాదాపు దామోదర రాజనరసింహకే హోం శాఖ పగ్గాలు అప్పచెపుతారంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు..