వరంగల్లో మంత్రుల ఇళ్ళ ముట్టడి, ఉద్రిక్తత
posted on Feb 4, 2013 1:32PM
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్లో తెలంగాణ వాదులు మంత్రుల ఇళ్ళ ముట్టడికి దిగారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ మంత్రి సారయ్య ఇంటి ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేసి విద్యార్థులను అక్కడి నుండి చెదరగొట్టారు.
ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి భర్త భాస్కర్ వాహనంపై కూడా ఆందోళనకారులు దాడి చేసి అద్దాలు పగులకొట్టారు. మరో మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిని కూడా ముట్టడించాలని వారు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ కోసం విద్యార్ధులు బలిదానాలు చేస్తుంటే మంత్రులు తమ పదవులలో కొనసాగడం సరికాదని వారు విమర్శిస్తున్నారు.