సమతా కేసును ఫాస్ట్ ట్రాక్ కు అందజేసిన అధికారులు.....

 

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ హత్యాచారానికి గురైన సమత కేసును పోలీసు లు ఈ నెల 16న చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు లో చార్జిషీటు దాఖలు చేయనున్నారు. శుక్రవారమే ఈ పని చేయాల్సి ఉండగా సోమవారానికి వాయిదా పడింది. నిందితులు షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ ముగ్దుం డీఎన్ఏ రిపోర్టు పోలీసు చేతికొచ్చింది. విచారణలో ఇది అత్యంత కీలకం కానుంది. నిందితులకు న్యాయ సహాయం చెయ్యకూడదని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.మరోవైపు బాధిత కుటుంబానికి ప్రభుత్వం చేయుతనిస్తోంది. సమత్వ పిల్లలను ఇచ్చోడ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లో చేర్పించారు. సమత భర్తకు రెవిన్యూశాఖలో అటెండర్ ఉద్యోగం ఇస్తూ ఉత్తర్వు జారీ చేశారు. తొలివిడత పరిహారంగా 4.12 లక్షలను మంజూరు చేశారు. ఖర్చుల కోసం ఎస్పీ మల్లారెడ్డి నగదు సహాయమందించారు.ప్రత్యేక కోర్టులో రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించినట్టు వివరించారు.సమత గ్యాంగ్ రేప్ హత్య కేసు విషయంలో పోలీసు దర్యాప్తు చురుగ్గా కొనసాగుతోంది. ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. సమత గ్యాంగ్ రేప్ అనంతరం నిందితుడు వదిలిపెట్టిన ఆధారాల అదనంగా పోలీసు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.