పోలవరం ఆంధ్రుల జీవనాడి

పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రుల జీవనాడని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్‌ను సీఎం సందర్శించి..పనుల పురోగతిని పరిశీలించారు. స్పిల్ వే నిర్మాణం, గేట్ల నిర్మాణ పనుల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను ఇంజీనీర్లు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ..దేశంలో నర్మదా ప్రాజెక్ట్ తరువాత జాతికి అంకితం చేసే ప్రాజెక్ట్ పోలవరమే అవుతుందన్నారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు సాగుతున్నాయని..ఐకాన్ బ్రిడ్జ్, పవర్‌హౌస్ నిర్మాణాలు త్వరలో చేపడతామని వెల్లడించారు. ప్రాజెక్ట్ వ్యయంలో 7 వేల కోట్ల రూపాయలు పనులకు ఖర్చు చేశామని..మరో 5 వేల కోట్ల రూపాయలు నిర్వాసితుల కోసం ఖర్చు చేశామని తెలిపారు.