పోలవరంలో అద్భుత ఘట్టం ఆవిష్కారం

 

పోలవరంలో అద్భుత ఘట్టం ఆవిష్కారమైంది..  ప్రాజెక్టు స్పిల్‌వే అంతర్భాగంలో నిర్మించిన గ్యాలరీని సీఎం చంద్రబాబు ఈరోజు ప్రారంభించారు.. అనంతరం ఆయన కుటుంబసభ్యులతో కలిసి గ్యాలరీలో నడిచారు.. వారి వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా గ్యాలరీలో నడిచారు.. గ్యాలరీ వాక్‌ ప్రారంభముతో పోలవరం ప్రాజెక్టు చరిత్రలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టైంది.