మోడీకి ట్రంప్ ఫోన్.. కంగ్రాట్స్..
posted on Mar 28, 2017 11:58AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రధాని మోడీకి ఫోన్ చేశారంట. ఇంతకీ ట్రంపే స్వయంగా ఫోన్ ఎందుకు చేశారబ్బా అనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే..ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో అధికారం చేపట్టి విజయభేరీ మోగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మోడీకి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారంట. ఈ విషయాన్ని మోదీకి ట్రంప్ ఫోన్ చేసిన విషయాన్ని వైట్హౌజ్ వెల్లడించింది. పీఎంవో ట్విట్టర్లోనూ ప్రధాని ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. కాగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్లో దాదాపు 15 ఏళ్ల తర్వాత బీజేపీ పార్టీ మళ్లీ అధికారం చేపట్టింది.