సైనికులకు మోడీ సెల్యూట్...


ఆర్మీ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ  సందర్భంగా ఆయన ట్విట్టర్లో "అందరు సైనికులకు, మాజీలకు, వారి కుటుంబాలకూ ఆర్మీడే శుభాభినందనలు. వారి ధైర్య సాహసాలకు, వారందిస్తున్న సేవలకు సెల్యూట్" అని ట్వీట్ చేశారు. దేశ రక్షణకు సైనికులు చూపిస్తున్న ధైర్యం, త్యాగం వెలకట్టలేనివని చెప్పారు. దేశ భద్రతకు విఘాతం కలుగకుండా చూసేందుకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన వేళ, సైన్యం అద్భుతంగా స్పందిస్తోందని అన్నారు. సైనికుల త్యాగం వల్లే, 125 కోట్ల మంది భారతీయులు ప్రశాంతంగా జీవిస్తున్నారని అన్నారు.