కాల్ మనీ, సెక్స్ రాకెట్ కేసు ఉచ్చులో ఆ ఇద్దరు కీలక టిడిపి నేతలు

 

 

ఏపీలో గత టిడిపి ప్రభుత్వ హయాంలో బయటపడ్డ కాల్ మనీ, సెక్స్ రాకెట్ కేసు వ్యవహారం సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. తాజాగా  ఇందులో టీడీపీ నేతల పాత్రపై విచారణ చేయాలంటూ బూరగడ్డ అనిల్ డీజీపీ గౌతమ్ సవాంగ్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకాతిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై ఈ కేసు విషయంలో మళ్ళీ విచారణ చేయాలని ఫిర్యాదులో కోరారు. ఈ విషయమై గతంలో డీజీపీగా పని చేసిన ఆర్పీ ఠాకూర్ కి ఫిర్యాదు చేసినా అయన పట్టించుకోలేదని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగిలిన నిందులతో పాటు బుద్ధా వెంకన్న, బోండా ఉమాలను కూడా విచారణ చేయాలని కోరారు.