ఈఎస్‌ఐ స్కామ్ లో మరో ట్విస్ట్.. యాంటిసిపేటరీ బెయిల్ కోరిన పితాని కుమారుడు

ఏపీలో ఈఎస్‌ఐ స్కామ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మ్నాత్రి అచ్చెన్నాయుడు తో సహా తొమ్మిది మందిని ఎసిబి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఈ స్కామ్ లో మాజీ మంత్రి పితాని పేరు కూడా వినిపించింది. ఐతే తాజాగా పితాని సత్యనారాయణ కుమారుడు పితాని సురేష్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీని పై విచారణ సందర్భంగా అయన తరుఫు లాయర్ ఏపీ ప్రభుత్వం రాజకీయంగా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని వాదించారు. ఇది ఇలా ఉండగా మాజీ మంత్రి పితాని వద్ద అప్పట్లో పీఎస్ గా ఉన్న మురళి మోహన్ ను ఈ రోజు ఉదయం సెక్రటేరియట్ వద్ద ఎసిబి అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో పితాని కుమారుడు ముందస్తు బెయిల్ పిటిషన్ ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.