ఇంటివద్దకే పెట్రోల్..ఆన్‌లైన్ బుకింగ్

 

పెట్రోలు బంకుల వద్ద పొడవైన క్యూలను నివారించేందుకు, న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను ప్రోత్స‌హించేందుకు చమురు మంత్రిత్వ శాఖ ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే...ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే ఇంటికే వెళ్లి పెట్రోల్ అందించే విధంగా. ఈ విషయాన్ని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ త‌న ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. వాహనదారుల ఇంటికే వెళ్లి పెట్రోల్‌ను అందించే దిశ‌గా తాము క‌స‌రత్తు చేస్తున్నామని.. ఆన్‌లైన్ బుకింగ్స్‌, ఫోన్ బుకింగ్‌ల ద్వారా వాహ‌నదారుల ఇంటివ‌ద్ద‌కే పెట్రోల్ పంపించే యోచన‌లో ప్ర‌భుత్వం ఉందని తెలిపారు.