అచ్చెన్నాయుడు వ్యవహారం పై హైకోర్టులో పిటిషన్
posted on Jul 2, 2020 6:25PM
మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ను నిన్న హడావిడిగా గుంటూరు జీజీహెచ్ నుండి డిశ్చార్జ్ చేసి విజయవాడ సబ్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దీని పై ఒక పక్క రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఐతే తాజాగా ఈ వ్యవహారం పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేవలం రాజకీయ కారణాలతోనే అచ్చెన్నాయుడును హాడావిడిగా గుంటూరు జీజీహెచ్ నుండి డిశ్చార్జ్ చేసి తరలించారని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యులపై ఒత్తిడి తెచ్చి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారని, ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా దీని పై వెంటనే చర్యలు తీసుకోవాలని వెంకటేష్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ శుక్రవారం జరిగే అవకాశం ఉంది.