భీమవరంలో షాకింగ్ ట్విస్ట్.. కౌంటింగ్ లో బిగ్ మిస్టేక్..


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాక మరియు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేశారు. అయితే అనూహ్యంగా రెండు చోట్లా పరాజయం పాలయ్యారు. దీంతో జనసేన శ్రేణులు పడుతున్న మనోవేదన అంతా ఇంతా కాదు. పవన్ కనీసం ఒక్క చోటైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారని ఆయన అభిమానులు ఆశపడ్డారు. కానీ వారి ఆశల మీద వైసీపీ ప్రభంజనం నీళ్ళు చల్లింది.

అయితే ఇప్పుడు తాజాగా భీమవరానికి సంబంధించి సంచలనం రేపే అంశం ఒకటి జన సైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.గత ఏప్రిల్ 11 న జరిగిన పోలింగ్ లో ఒక్క భీమవరం నుంచి మొత్తం ఒక లక్ష 68 వేల 5 ఓట్లు పోలయ్యాయి అని సాక్షి పేపర్ లోనే వేశారు. కానీ నిన్న సీన్ కట్ చేస్తే మాత్రం అక్కడ ఏకంగా ఒక లక్ష 92 వేల 61 ఓటింగ్ నమోదు అయ్యినట్టు వెల్లడైంది.దీనితో తప్పు ఎక్కడ జరిగిందని పోల్ అయిన ఓట్ల కన్నా ఎక్కువ కౌంటింగ్ రావడం ఏమిటని మళ్ళీ అక్కడ కౌంటింగ్ నిర్వహించాలని జనసేన శ్రేణులు ఎన్నికల సంఘం వారిని డిమాండ్ చేస్తున్నారు.మరి వీరి డిమాండ్ పై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి.