పవన్ కు బాబుకు అక్కడే చెడిందట..!

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్సల తీవ్రత పెంచారు. గత ఏడాది ఈ టైంలో టీడీపీ-జనసేన కలిసే ఉన్నాయి. కానీ ఏడాదికి వచ్చే సరికి పరిస్థితి మొత్తం మారిపోయింది. నిన్నటి వరకూ మిత్రులు అనుకున్నవాళ్లే ఇప్పుడు శత్రువులుగా తయారయ్యారు. ఎప్పుడైతే జనసేన పార్టీ ఆవిర్భావం దినోత్సవం రోజున టీడీపీని విమర్శించి అందరికీ షాకిచ్చారో ఆ రోజు నుండి ఏదో ఒక సందర్భంలో టీడీపీపై చంద్రబాబు పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు వైసీపీ అధినేత జగన్ మాత్రమే చంద్రబాబు ను తిట్టేవాడు. రాష్ట్రంలో ఏం జరిగినా దానికి చంద్రబాబే కారణమంటూ టైం దొరికినప్పుడల్లా చంద్రబాబుపై విమర్శలు గుప్పించేవాడు. ఇక ఇప్పుడు పాదయాత్ర నేపథ్యంలో మొత్తం చంద్రబాబునే టార్గెట్ చేశారనుకోండి. అది వేరే విషయం. అయితే ఇప్పుడు పవన్ జగనే మించి పోయాడు. చంద్రబాబుపై విమర్శలు గుప్పించడంలో జగన్ కు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం పవన్ శ్రీకాకుళం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై తీవ్రస్థాయిలోనే విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు ఏకంగా  తనపై దాడి చెయ్యడానికి ముఖ్యమంత్రి కిరాయిగూండాలను పంపించారు అని అభియోగించారు. చంద్రబాబు బద్దశత్రువులు కూడా ఎప్పుడు ఇటువంటి ఆరోపణలు చెయ్యలేదు. అయితే ఉన్నట్టుండి చంద్రబాబుపై పవన్ ఇంతలా విమర్శలు చేయడానికి కారణం ఏంటీ.. అసలు వీరిద్దరికీ ఎక్కడ చెడింది అన్న చర్చల నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం బయటపడింది. జనసేన టీడీపీ పొత్తు చర్చలు విఫలం అవ్వడమే దీనికి కారణం అంటున్నారు. టీడీపీని జనసేన 50 సీట్లు అడగగా, చంద్రబాబు కేవలం 16 ఇస్తా అన్నారట. దీనిని పవన్ కళ్యాణ్ అవమానంగా ఫీల్ అయ్యారట పవన్. అందుకే చంద్రబాబుపై పవన్ ఇంతలా విరుచుకుపడుతున్నారట. ఈ నేపథ్యంలోనే నేను గెలవకపోయినా టీడీపీని ఓడిస్తా అని శబధం చేసి చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారట. మరి ముందు ముందుపవన్ ఇంకెన్ని విమర్శలు గుప్పిస్తారో చూద్దాం...