పవన్ పై కేసు నమోదు..

 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మీడియాపై వార్ చేస్తున్న సంగతి తెలిసిందే. పలు ఛానళ్లను చూడొద్దని ఇటీవలే పవన్ తన అభిమానులకు పిలుపునిచ్చారు కూడా. ఇక పవన్ పిలుపు మేరకు ఇప్పటికే ఆయన అభిమానులు ఆ ఛానెళ్లను బ్యాన్ కూడా చేశారు. పవన్ కూడా తమ ట్విట్టర్ ఖాతా ద్వారా మీడియాపై వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. దీంతో కొన్ని మీడియా సంఘాలు.. బంజారా హిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో పవన్ పై కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఐపీసీ సెక్షన్లు 469, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు వారు పలు ఆధారాలను సమర్పించినట్లు తెలిసింది.