వాళ్లకి కావాల్సినంత టైం ఇస్తున్నా..

తనను టార్గెట్ చేస్తూ.. గత కొన్ని నెలలుగా కొన్ని మీడియా ఛానెళ్లు తనపై వ్యక్తిగత ధూషణలు చేస్తూ.. డిబెట్లు పెడుతూ టైం పాస్ చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాపై యుద్దం ప్రకటించిన సంగతి తెలిసిందే. పలు చానళ్లలో తనకు వ్యతిరేకంగా చర్చలు పెడుతున్నారని, కొంతమందితో కావాలనే తనపై విమర్శలు చేయించి, వాటిని పదేపదే టీవీల్లో చూపుతున్నారని పవన్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు తన ట్విట్టర్ వేదికగా పలువురి పేర్లు బయట పెడుతూ.. సంచలన ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ట్వీట్ చేశారు ఆయన. తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు. "తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్న మీడియా చానళ్లకు, వాటి అధినేతలకు, వాటిల్లో వాటాదారులకు, బోర్డు సభ్యులకు మేము లీగల్ నోటీసులు పంపనున్నాము. మేము ఇచ్చే నోటీసులపై స్పందించేందుకు వారికి చాలినంత సమయం ఇస్తాం" అని అన్నారు.