చంద్రబాబుకు పవన్ సూటి ప్రశ్న... మీకు ఏది ముఖ్యం...?

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో పవన్ ను అనవసరంగా ఆయన పేరును తెరపైకి తీసుకొచ్చారు. దీనిలో భాగంగానే శ్రీరెడ్డి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేసిన సంగతి కూడా విదితమే. దీంతో పవన్ మీడియాపై మండిపడ్డారు. టీఆర్పీలను పెంచే షోల కోసం ఛానళ్లు చచ్చిపోతున్నాయని ఆయన ట్వీట్ చేశారు. దానికి మించిన షోను తాను ఇస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఆయన మరో ట్వీట్ చేశారు. 'ముఖ్యమంత్రి చంద్రబాబు గారు... ఈ ఛానళ్లు అన్నింటికీ ప్రత్యేక హోదా కంటే వ్యభిచారం యొక్క చట్టబద్ధతే ముఖ్యం. మీడియాను కంట్రోల్ చేసే శక్తి గల మీరు... ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్యతను ఇస్తారు? ఒక్క విషయాన్ని చెప్పడం మర్చిపోయా. టీవీ5 సీనియర్ యాంకర్ సాంబశివరావును నారా లోకేష్ ఎంతో ప్రేమతో అంకుల్ అని పిలుస్తుంటారు' అని ట్వీట్ చేశారు. ఒకప్పుడు దొరలు అంటే భూస్వాములని... కానీ, ఇప్పుడు దొరలంటే మీడియా ఆసాములని... వారు చెప్పిందే వేదం, పాడిందే నాదమని ఎద్దేవా చేశారు. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూద్దాం...