సీమాంద్రలో పంచాయితీ డౌట్
posted on Jul 30, 2013 10:08PM
కేంద్ర తెలంగాణ ప్రకటన నేపధ్యంలో సీమాంద్రలో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాగా మరి కొంత మంది అదే బాటలో నడవడానికి రెడీ అవుతున్నారు. పలు జేఎసికి సంబందించిన నాయకులు బంద్కు పిలుపు నిచ్చారు దీంతో రేపు సీమాంద్ర ప్రాంతంలో జరగాల్సిన పంచాయితీ మూడో దశ ఎలక్షన్లపై ఆ ప్రభావం పడనుంది.
పలు సీమాంద్ర జిల్లాల్లో రేపు చివరి దశ పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో సీమాంద్ర నాయకులు ఎన్నికలను బహిష్కరించాల్సిందిగా పిలుపునివ్వగా, చాలా మంది టీచర్లు తమ విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో రేపు సీమాంద్రలో జరగాల్సిన పంచాయితీ ఎన్నికలపై స్పష్టత రావాల్సి ఉంది.