కష్టాల్లో పళనిస్వామి..అవిశ్వాస తీర్మానం పెట్టిన స్టాలిన్

తమిళనాడు రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారాయి. ఇప్పటి వరకు పార్టీలో చీలికలు, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాలతో పరువు పొగొట్టుకున్న అన్నాడీఎంకే సర్కార్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ప్రతిపక్షనేత స్టాలిన్ పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా పళనిస్వామి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ప్రభుత్వం కొనసాగేందుకు అర్హత లేదని ఆరోపించిన ఆయన, తక్షణం ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొవాలని డిమాండ్ చేశారు. విశ్వాస పరీక్షలో పళనిస్వామి ప్రభుత్వం నెగ్గే అవకాశాలే లేవని ప్రభుత్వ వ్యతిరేక ఎమ్మెల్యేలు, ప్రజలు కూడా ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా అని ఎదురుచూస్తున్నారన్నారు.