లోక్సభ స్పీకర్గా బిర్లా.. ఎన్నిక ఏకగ్రీవం!!
posted on Jun 18, 2019 12:46PM
లోక్సభ స్పీకర్గా రాజస్థాన్లోని కోటా ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యే అవకాశాలు కన్నిస్తున్నాయి. స్పీకర్ ఎన్నికకు ఎన్డీయే అభ్యర్థిగా ఓం బిర్లా పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. 17వ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు ప్రొటెం స్పీకర్గా వీరేంద్ర కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత నూతన ఎంపీలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. ఈ రోజు కూడా నూతన ఎంపీల ప్రమాణస్వీకారాలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక చేపట్టనున్నారు. స్పీకర్ గా బిర్లా ఎన్నిక ఏకగ్రీవం కానుంది. లోక్సభ స్పీకర్గా మేనకా గాంధీ సహా అనేక మంది బీజేపీ సీనియర్ల పేర్లు వినిపించాయి. అయితే చివరకు ఓం బిర్లా వైపు బీజేపీ పెద్దలు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.