ఉత్తర కొరియా వెనుక పాకిస్థాన్..!

అమెరికా సహా ప్రపంచదేశాల హెచ్చరికలను లెక్కచేయకుండా వరుస ప్రయోగాలు, అణు పరీక్షలతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తర కొరియా వెనుక ఎవరున్నారు అంటే ఖచ్చితంగా వినిపించే పేరు చైనా..లోకం మొత్తం ఈ విషయాన్ని కోడై కూస్తుంది..కానీ ఇప్పుడు నార్త్ కొరియాకు మరో దేశం కొమ్ము కాస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు భారత విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్. న్యూయార్క్‌లో జరిగిన అమెరికా, జపాన్ దేశాధినేతలతో జరిగిన త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ..కొరియా అణుపరీక్షలకు పాక్ సాయం చేస్తోందన్నారు. పాక్-ఉత్తర కొరియా అణు సంబంధాలపై విచారణ చేయాల్సిందిగా ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జపాన్ భూభాగం మీదుగా చేపట్టిన మరో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం నేపథ్యంలో ఉత్తర కొరియా వైఖరిని సుష్మ తప్పబట్టారు.