ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన!

ఈ ఏడాది ఎలాంటి కొత్త పథకాలను ప్రారంభించబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఇతర పథకాలపై ఖర్చులు తగ్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నూతన పథకాల కోసం ఎలాంటి ప్రతిపాదనలూ పంపవద్దని అన్ని మంత్రిత్వ శాఖలకూ తెలియజేశామని వెల్లడించారు.

ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీల ద్వారా మాత్రమే నిధులను ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ రెండు పథకాలపైనే డబ్బులు వెచ్చించడానికి తాము అనుమతినిస్తున్నామని, ఇతర పథకాలను ఈ ఆర్థిక సంవత్సరంలో అనుమతించమని ఆర్థిక శాఖ ప్రకటించింది.

కరోనా నేపథ్యంలో నిధులకు సంబంధించి ప్రాధాన్యతలు మారిపోతున్నాయని, అవసరమైన వాటికే నిధులను ఉపయోగించాల్సిన అవసరం ఉందని నిర్మల తెలిపారు. ఒకవేళ నిబంధలనకు విరుద్ధంగా నిధులను కేటాయించాల్సి వస్తే, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్ పెండిచర్ అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు.