కాంగ్రెస్ నా పుట్టినిల్లు...

 

బీజేపీ పార్టీ నుండి బయటకు వచ్చిన సిద్దూ... ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సిద్దూ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నా పుట్టినిల్లు... కాంగ్రెస్‌లో చేరడం తిరిగి సొంతింటికి వెళ్లినట్లు ఉందని..తిరిగి కాంగ్రెస్ లోకి రావడం ఆనందంగా ఉందని అన్నారు. పంజాబ్ హక్కుల కోసం పోరాటం చేస్తానని..తన తండ్రి 40 ఏళ్లు కాంగ్రెస్ కోసం పని చేశారని తెలిపారు. అంతేకాదు పంజాబ్ యువత డ్రగ్స్ కు బానిసలవుతున్నారు..పంజాబ్‌లోనే ఎందుకు డ్రగ్స్ సమస్య ఉందని ప్రశ్నించారు. పంజాబ్ ప్రభుత్వానికి డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయని ఆరోపించారు. పంజాబ్ లో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని అన్నారు.