నవజ్యోత్ సింగ్ సిద్దూకు షాక్... బ్యాంక్ అకౌంట్లు సీజ్...


మాజీ క్రికెటర్, పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూకు షాక్ తగిలింది. ఐటీ రిటర్న్స్ కు సంబంధించి సరైన ఆధారాలు సమర్పించని కారణంగా... ఆయనకు చెందిన రెండు బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఐటీ అధికారులు మాట్లాడుతూ.. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సిద్ధూ చేసిన ఖర్చుకు సంబంధించి సమర్పించిన పత్రాల్లో అవకతవకలు ఉన్నాయని.. అదనంగా మరో రూ. 52 లక్షల పన్ను కట్టాల్సిందేనని ఆదేశించారు. అంతేకాదు.. గత జనవరిలోనే సిద్దూకు నోటీస్ ఇచ్చామని... ఈ నోటీసులపై సిద్దూ అప్పీల్ కు వెళ్లారని... అయితే, విచారణ చేపట్టిన కమిషనర్ చివరకు పన్ను కట్టాల్సిందేనంటూ తీర్పును వెలువరించడంతో... బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశామని ఐటీ అధికారులు ప్రకటించారు.