బోయపాటి కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్

సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సీతారావమ్మ(80) అనారోగ్యంతో మరణించారు. గుంటూరు జిల్లా పెదకాకాని ఆమె స్వగ్రామం. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. శుక్రవారం రాత్రి 7.22 నిమషాలకు ఆమె మరణించారు.

కాగా, బోయపాటి కుటుంబాన్ని టీడీపీ నేతలు నారా లోకేష్, కళా వెంకట్రావు పరామర్శించారు. శనివారం ఉదయం పెదకాకానిలోని బోయపాటి నివాసానికి వెళ్లిన నేతలు.. సీతారావమ్మ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.