విజయసాయిరెడ్డి పై లోకేశ్ మండిపాటు....

 

వైసీపీ ఎంపీ  విజయసాయిరెడ్డి పై టీడీపీ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని తమ ఎంపీలు రాజ్యసభలో మాట్లాడుతున్నారని, విజయసాయిరెడ్డి మాత్రం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టగానే తొలుత అద్భుతం జరిగిందని విజయసాయిరెడ్డి అన్నారని... ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ప్రధాని మోదీని వైసీపీ ఎంపీలు ఎందుకు అడగట్లేదని ప్రశ్నించారు. మోదీ సభకు వస్తే నిలదీయకుండా పరారవుతున్నారు లేక కాళ్ల మీద పడుతున్నారని అన్నారు. టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలని కొందరు అంటున్నారని, ఎంపీలు రాజీనామా చేస్తే ఇంకెవరు పోరాడతారని ఆయన ప్రశ్నించారు.