హైదరాబాద్ నడిబొడ్డున దారుణహత్య...పొడిస్తే పేగులు బయటకొచ్చాయి

రాన్రానూ మనుషులలో క్రూరత్వం పెరిగిపోతోంది, మాట్లాడి తేల్చుకునే విషయాలలో కూడా పట్టుదలలకి పోయి చంపుకునే దాకా వెళుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఒక మహిళ విషయంలో జరిగిన చిన్న వివాదం హత్యకు దారి తీసింది. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే పంజాగుట్టకు చెందిన అన్వర్‌ (32), ప్రతాప్‌నగర్‌కు చెందిన రియాసత్‌ అలీ అనే ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరికీ ఓకే మహిళతో వివాహేతర సంబంధం ఉండడంతో ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి. అయితే నిన్న సాయంత్రం పంజాగుట్ట ఆటోస్టాండ్ వద్ద ఈ విషయంలో ఇద్దరి మధ్య మరోమారు గొడవ జరిగింది. ఆ వివాదం ముదరడంతో రియాసత్ తనవెంట తెచ్చుకున్న కత్తితో అన్వర్‌పై దాడిచేశాడు. పొట్టలో విచక్షణ రహితంగా పొడిచాడు. కత్తితో పొడవడంతో అతడి పేగులు బయటకు వచ్చేసాయి దీంతో బయటకు వచ్చిన పేగులను షర్ట్ లోపలకు అనుకుని పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి కుప్పకూలిపోయాడు. ఈ సంఘటన రోడ్డు మీద ఉన్న వారితో పాటు పోలీసులను కూడా భయబ్రాంతులకు గురి చేసింది. అయితే అతడిని వెంటాడుతూ వచ్చిన రియాసత్ పోలీసులకు లొంగిపోయాడు. అయితే అతను బతికే ఉన్నాడనుకుని గాంధీ ఆసుపత్రికి తరలించేలోగా ఆ వ్యక్తి కన్నుమూశాడు. అయితే నిందితుడి వర్షన్ వేరేలా ఉంది, చనిపోయిన వ్యక్తి తన మీద పగబట్టి తన భార్యా పిల్లలకి హెచ్ ఐ వీ ఉన్న రక్తం ఎక్కించాడని అందుకే చంపేశానని పేర్కొన్నాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.