మాట వినడం లేదు.. అఖిలేశ్ పైనే పోటీ చేస్తా..
posted on Jan 16, 2017 2:06PM
గత కొద్ది రోజులుగా సమాజ్ వాదీ పార్టీలో రాజకీయ విభేదాలు తెలత్తుతూనే ఉన్నాయన్నసంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది కూడా తండ్రీ, కొడుకుల మధ్య కావడంతో ఇది మరీ హాట్ టాపిక్ గా మారింది. ఎంత మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. అని పలుమార్లు చెబుతున్నా..లోపల మాత్రం విభేదాలు ఉన్నాయన్న సంగతి అర్ధమయిపోతుంది. ఇప్పుడు ఆ యుద్దం కాస్త తారాస్థాయికి చేరుకొని.. పార్టీలో చీలికలు ఏర్పడి.. పార్టీ గుర్తుకోసమే పోటీ పడే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ములాయం ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తన కొడుకుపైనే నేరుగా పోటీకి దిగనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ములాయం సింగే చెప్పినట్టు వినికిడి. లక్నోలో పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో.. బీజేపీతో పాటు ఇతర పార్టీలతో అఖిలేశ్ చేతులు కలిపినట్లు తెలుస్తున్నది, అతన్ని అడ్డుకునేందుక నేను పోటీలో దిగుతా, అతన్ని ఓడించేందుకు ప్రజల హెల్ప్ తీసుకుంటా, అఖిలేశ్ విడనం లేదు, ఎన్ని చెప్పినా తన తప్పు తెలుసుకోవడం లేదని ములాయం అన్నారుట. మరి దీనిపై అఖిలేశ్ యాదవ్ ఎలా స్పందిస్తారో చూద్దాం..