సీఎం కేసీఆర్ ను చర్లపల్లి జైల్లో పెట్టాలి: రేవంత్‌రెడ్డి

తెలంగాణ సచివాలయం కూల్చివేత పనుల్లో అక్కడ ఉన్న నల్లపోచమ్మ దేవాలయం, మసీదు ధ్వంసం కావడంపై ప్రతిపక్ష నేతలు కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ఉద్యమానికి వేదికైన నల్లపోచమ్మ దేవాలయం, మసీదులను అమానుషంగా కూల్చటాన్ని ఖండిస్తున్నామన్నారు. మసీదు, దేవాలయాన్ని కూలగొట్టిన సీఎం కేసీఆర్, సీఎస్ సోమేష్‌కుమార్‌ కు బేడీలు వేసి.. చర్లపల్లి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా బీజేపీ నేతలు మాట్లాడటం లేదని, కేసీఆర్ వేసే మెతుకుల కోసం కక్కుర్తిపడుతున్నారని మండిపడ్డారు. దేవాలయం కూల్చివేతపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని డిమాండ్ చేశారు.