టీడీపీ అధ్యక్షుడిగా యువనేత!!

 

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడిని నియమించనున్నారు. త్వరలోనే ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిమిడి కళా వెంకట్రావు కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో రామ్మోహన్ నాయుడి పేరు తెరపైకి వచ్చింది. పార్టీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇస్తే బాగుంటుందని కొందరు నేతల నుంచి వచ్చిన సూచలన మేరకు రామ్మోహన్ నాయుడి పేరును చంద్రబాబు పరిశీలించి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.