హైకోర్ట్ లో పిటిషన్ వేసిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై అనర్హత వేటు వేయడానికి వైసీపీ ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజు హైకోర్ట్ లో పిటిషన్ వేశారు. తనపై అనర్హత, సస్పెన్షన్ చర్యలు అడ్డుకోవాలని పిటిషన్ లో కోరారు. తను ఎటువంటి పార్టీ వ్యతిరేఖ చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేసిన రఘురామ కృష్ణంరాజు.. తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ పై షోకాజ్ నోటీసులు వచ్చాయని, తాను ఎన్నికైన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరు మీద షో కౌజు నోటీస్ ఇవ్వలేదని తెలిపారు. ప్రస్తుతం కరోనా దృష్ట్యా అత్యవసర కేసులు మాత్రమే హైకోర్టు విచారిస్తోంది. ఈ పిటిషన్ సోమవారం పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది.