మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు.. నేడు క్లారిటీ..

 

కావాలనే అన్నాడో.. లేక ఏదో ఆవేశంలో అన్నాడో తెలియదు కానీ మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు మాత్రం పెద్ద సంచలనం రేపుతున్నాయి. ఇంతకీ మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు ఏంటనుకుంటున్నారా...? కేసీఆర్ మనోడే.. మంచోడే అంటూ...తెలుగుదేశం పార్టీ మునిగిపోకముందే మేలుకుందాం.. తెరాసలో విలీనం చేసేద్దాం అని అన్నాడు. దీంతో టీడీపీ నేతలు ఒక్కసారి ఖంగుతినగా.. పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం మండిపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణా తెలుగుదేశం పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ తెలుగుదేశం పొలిట్‌బ్యూరో‌, కేంద్ర కమిటీ సభ్యులు ఇక్కడ భేటీ కానున్నారు. మరి ఈ భేటీకి మోత్కుపల్లి వస్తారో..?లేదో..? అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ సమావేశానికి మోత్కుపల్లి వచ్చినా సంచలనమే.. రాకపోయినా సంచలనమే. ఈ భేటీలో ఆయనే హాట్ టాపిక్ అవ్వనున్నారు. అయితే మోత్కుపల్లి ఒక్కడే కాదు... పలువురు నేతలు కూడా విలీన ప్రతిపాదనకు మద్దతిస్తున్నారు. దీంతో  ఈ విషయంపై చర్చ సీరియస్ గానే జరిగే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. అయితే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి చూద్దాం.. ఏం జరుగుతుందో..