రోజా ఇంట్లో భారీ చోరీ...


వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ చోరీ జరిగింది. మణికొండలోని పంచవటి కాలనీలో రోజా నివాసముంటుంది. ఆమె నివాసంలో దొంగలు ఇంట్లోంచి..రూ. 10లక్షలు విలువచేసే బంగారం, వెండి అభరణాలు ఎత్తుకెళ్లారు. ఇంట్లో తెలిసిన వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉండొచ్చునని రాయదుర్గం పోలీసులు అంటున్నారు. పోలీసులు.. మణికొండలోని రోజా నివాసానికి చేరుకొని.. పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నారు.