ఎమ్మెల్సీ పదవికి మంత్రి సోమిరెడ్డి రాజీనామా!!

 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నారు. 2016లో గవర్నర్‌ కోటాలో సోమిరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన పదవీ కాలం 2022 వరకు ఉంది. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి పోటి చేయాలని భావిస్తున్నారు. దీంతో ఆయన ఎన్నికలకు ముందుగానే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. కొద్దిసేపటి క్రితం నెల్లూరు నుంచి సోమిరెడ్డి అమరావతికి బయలుదేరారు. అసెంబ్లీ కార్యదర్శిని కలిసి తన రాజీనామా లేఖను ఇవ్వనున్నట్లు సమాచారం.