తుమ్మితే సత్యం అనేవాళ్లు! ఇప్పుడు సచ్చాంరా...
posted on Apr 9, 2020 12:44PM
ఎవరైనా తుమ్మితే సత్యం అనేవాళ్లు.. ఇప్పుడు ఎవరైనా తుమ్మితే సచ్చాంరా అని అంటున్నారని మంత్రి హరీష్ రావు నవ్వుతూ వ్యాఖ్యానించారు. కరోనా.. కరోనా.. అంటే ఓ ముసలావిడ ఏమందంటే.. కరోనా పేరు మంచిగ ఉందిగాని బిడ్డా.. ఈ చంపుడు మంచిగా లేదని అన్నదని హరీష్రావు చెప్పారు.
కరోనాకు మందులేదని, ఎవరి ఇంట్లో వాళ్లు ఉండడమే దీనికి మందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడొక ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొంటున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ఇక్కడ కరోనా అదుపులో ఉందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ఇక్కడ కరోనా అదుపులో ఉందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కేవలం 6 కోట్ల జనాభా ఉన్న ఇటలీనే కరోనాను అదుపు చేయలేకపోతోందని, అలాంటిది 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో కరోనా అదుపు తప్పితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తేనే ఆందోళన కలుగుతుందని మంత్రి అన్నారు.