బాయ్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడుతూ.. ఆత్మహత్య

బాయ్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడుతూ ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌ కొంపల్లి శివార్లలోని శివశివానీ కాలేజీలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న హనీషా చౌదరి అనే యువతి దక్షిణ్ పటేల్ అనే యువకుడిని ప్రేమించింది. ఏం జరిగింది ఏమిటో తెలియదు కానీ.. ప్రియుడికి వీడియో కాల్ చేసి.. అతను చూస్తుండగానే.. హాస్టల్ గదిలో ఊరేసుకుంది.. పరుగు పరుగున హాస్టల్‌కు చేరుకున్న దక్షిణ్ పటేల్‌ ఆమె స్నేహితురాలికి విషయం చెప్పి.. హానీషా తలుపు బద్దలుకొట్టి చూడగా... ఆమె వేలాడుతూ కనిపించింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనో ప్రాణాలు కోల్పోయింది. హాస్టల్ సిబ్బంది సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. హానీషా స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం.