బుల్లి తెరపై మెగా ఎంట్రీ..!!

 

కాంగ్రెస్ పార్టీ ఓటమితో రాజకీయాల్లో విరామం దొరికాక మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం ప్రస్తుతం కథలు వింటున్నాడని ఇండస్ట్రీ టాక్. ఆయన సినిమా కోసం మెగా అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మెగా హీరో తొందరలోనే బుల్లి తెరపై మెగా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్వహిస్తూ తొలిసారిగా తన సినీ జీవిత విశేషాలు చెబుతున్న ‘సౌందర్యలహరి’ ప్రొగ్రాంలో అతిథిగా వచ్చి మెగా అభిమానులను పలకరించనున్నాడట. ఇది ఆగస్ట్ 3న ప్రసారంకానుందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ షో ద్వార మెగాస్టార్ బుల్లితెర‌పై కనిపించి ప్రేక్షకుల్లో జోష్ పెంచబోతున్నారని లేటెస్ట్ టాక్.