అమెరికాలో మళ్లీ కాల్పులు.. ముగ్గురి మృతి

అమెరికాలో కాల్పుల ఘటనలు రోజు రోజుకు మరింత ఎక్కువవుతున్నాయి తప్ప తగ్గడం లేదు. కొద్ది రోజుల క్రితం లాస్ వేగాస్‌లో ఒక మ్యూజిక్ ఫెస్టివల్‌ను లక్ష్యంగా చేసుకొని దుండగులు జరిపిన కాల్పుల్లో 70 మంది వరకు మరణించగా.. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. ఆ ఘటనను ఇంకా మరువక ముందే ఇవాళ మరో ఘటన జరిగింది. మేరీల్యాండ్ ఆఫీస్ పార్క్‌లో ఒక ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడిని రాడీ లబీబ్ ప్రిన్స్‌గా గుర్తించారు. అతను అడ్వాన్స్ గ్రానైట్ సొల్యూషన్స్‌లో గత నాలుగు నెలలుగా మెషిన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.