కలత చెందిన ప్రధాని

 

 

పార్లమెంటు ఆందోళనలపై ప్రధాని మన్మోహన్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. బుధవారం ఓటాన్ రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో సీమాంధ్ర ఎంపీలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశారు. సభను సక్రమంగా నిర్వహించకుండా అడ్డుపడ్డారు. కేంద్రమంత్రులు కూడా పోడియం వద్దకు వెళ్లారు. ఈ ఘటనతో కలత చెందినట్లు ప్రధాని తెలిపారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిదికాదని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా రాష్ట్ర విభజన అంశంతో ఉభయసభలు రగిలిపోయాయి.