68 మంది తీవ్రవాదులు మార్చేసిన శాంతిమంత్రం....
posted on Aug 16, 2017 12:40PM
ఉగ్రవాదులను మామూలుగా మనుషుల్లాగా మార్చాలంటే అది మామూలూ విషయం కాదు. కరుడు కట్టిన గుండెతో ఎదుటి వారి ప్రాణాలు తీయడం కాదు కదా.. తమ ప్రాణాలు సైతం తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు. కానీ అలాంటి ఉగ్రవాదులను ఒకరిని కాదు ఇద్దరిని ఏకంగా 68 మందిని మార్చేశారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్. తన శాంతి మంత్రంచే వీరందరిని మార్చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిస్థాపన కోసం శ్రీశ్రీ రవిశంకర్ కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కృషికి ఫలితంగా... మణిపూర్లో 68 మంది తీవ్రవాదులు ప్రభుత్వానికి లొంగిపోయారు. వారి దగ్గర ఉన్న ఆయుధాలు, తుపాకులను పోలీసులకు అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. దీంతో శ్రీశ్రీ రవిశంకర్ చేసిన కృషికి గాను మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్షా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన శాంతిమంత్రంచే 11 తీవ్రవాద సంస్థలకు చెందిన సభ్యులు లొంగిపోయేలా చేశారని అన్నారు.