పోలీసులే ఎన్ కౌంటర్ చేస్తే.. ఇక కోర్టులెందుకు..? మాజీ మంత్రి మేనకా గాంధీ

 

షాద్‌నగర్ లో ఈ ఉదయం జరిగిన దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశం నలుమూలల నుండి హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ పోలీసులకు జై కొట్టి ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. దీని పై పలు పార్టీల నేతలు, సెలబ్రిటీలు సైతం తెలంగాణ పోలీసుల చర్యను స్వాగతిస్తున్నారు. ఇటువంటి చర్యలు తీసుకుంటేనే దేశంలో మహిళల పట్ల జరుగుతన్న  అఘయిత్యాలు జరగకుండా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. ఐతే కొందరు మాత్రం తెలంగాణ పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. కోర్టులు విచారించి విధించాల్సిన శిక్షలను పోలీసులే విధిస్తే ఎలా అనే వారు కూడా ఉన్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత మేనకా గాంధీ ఈ ఎన్ కౌంటర్ పై స్పందిస్తూ హైదరాబాద్‌లో జరిగిన ఘటన చాలా భయంకరమైంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. మీకు చంపాలనిపించిందని కాల్చి చంపడం కరెక్టు కాదు. నిందితులకు కోర్టుల ద్వారా మాత్రమే కఠిన శిక్షలు పడాలి. ఇలా న్యాయ ప్రక్రియ పూర్తి కాకముందే కాల్చి చంపితే.. ఇక కోర్టులు, న్యాయ, పోలీస్ వ్యవస్థలు ఎందుకు?''. అని మేనకా గాంధీ అన్నారు.